మన్యం మనుగడ వెబ్ డెస్క్ :
ఇంటర్ డిగ్రీ విద్యార్థుల వద్ద నుండి పరీక్ష ఫీజులను ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే తీసుకోవాలని,నిబంధనలను అతిక్రమించి అధిక మొత్తంలో తీసుకునే కళాశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని PDSU ఇల్లందు పట్టణ నాయకులు ఎ.పార్ధు అన్నారు. ఇల్లందు పట్టణ స్థాయి ముఖ్యుల సమావేశం గురువారం జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొన్ని ప్రైవేట్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా 1000 నుండి 2000 రూపాయలు పేద మధ్య తరగతి విద్యార్థుల వద్ద నుండి వసూలు చేయడంతో ఫీజులు కట్టలేని కొంతమంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా నిష్క్రమించే పరిస్థితి ఏర్పడిందని దీనితో డ్రాపౌట్స్ గా విద్యార్థులు తయారవుతున్నారు అని ఆయన అన్నారు.ప్రభుత్వ అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా ఫీజుల విషయంలో ఎటువంటి పరిశీలన లేకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని విద్యాసంస్థలు పరీక్ష ఫీజుల పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.ఇంటర్మీడియట్ మోడల్ అధికారులు కాకతీయ యూనివర్సిటీ పరిధి అధికారులు తక్షణమే స్పందించి అధిక ఫీజుల వసూళ్ళను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు గుమ్మడి రవీనా, బి సాయి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: