చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: బాధితులకు అండగా నిలవటం ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహక అధ్యక్షులు గోళ్ల రమేష్ అన్నారు.బుధవారం తిప్పన పల్లి గ్రామానికి చెందిన లివర్ వ్యాధిగ్రస్తుడు షేక్ షఫీకు రూ. 8500ల విలువచేసే మందులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడం జరిగిందని, తమ వంతు గా ఎంతోకొంత సహాయం బాధితులకు అందజేస్తున్నామని, మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామనిన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, గ్రామస్తులు జాలె లక్ష్మయ్య, బాబా, రవి, సలీమ్, యాకుబ్, గాపూర్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: