మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నందు 2015 జూన్ నుండి డిసెంబర్ 24, 2021 వరుకు విధులు నిర్వహించిన 14 మంది సిబ్బందికి ఈ రోజు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నందు సిఐ బంధం ఉపేంద్ర ఆధ్వర్యంలో ఎస్ఐ చల్ల అరుణ మరో ఎస్ఐ రామ్మూర్తి సమక్షంలో అశ్వారావుపేట నుండి వేరు వేరు ప్రాంతంలకు బదిలి కాబడిన వారికి సన్మానం చేసి భవిషత్ లో ఉన్నత స్థాయి కి వెళ్లాలని అలానే గడిచిన 6 సంవత్సరాలు కాలంలో అశ్వారావుపేట ప్రజలకు అధికారులకు ఎలైతే సేవలందించిన మన్నలన్లు పొందేరు వారు బదిలీ కాబడిన స్థానంలో కూడా అలానే మంచి పెరు సంపాదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బదిలీ కాబడిన ఎం కృష్ణ, పీ ప్రసాదరావు, బి శ్రీనివాసరావు, ఎన్ రాజేష్, టీ రవి, బెతుపల్లి శ్రీనివాసరావు, గంగారాం శ్రీను, గన్ మెన్ శ్రీను, జీ సత్యనారాయణ, వీ నరేష్, అరవింద్ లకు సీఐ బంధం ఉపేంద్ర, ఎస్ఐ చల్ల అరుణ మరో ఎస్ఐ రామ్మూర్తి సమక్షంలో సన్మానం చేశారు. పోలీస్ సిబ్బంది మరికొందరు పై కార్యక్రమంలో పాల్గున్నారు. బదిలీ అయిన సిబ్బంది మాట్లాడుతూ అశ్వారావుపేట లో మేము పనిచేసింది 6 సంవత్సరాలు దాటినప్పటికి మా ఉన్నతాధికారులు ప్రజలు మీడియా మాకు సహకరించడంతో మేము కేవలం 6 నెలలు మాత్రమే అయినట్టు ఉంది అంటూ వీడ్కోలు సమయాలలో చెపుతూనే ఈ ప్రాంతం నుండి వృత్తి రీత్యా బదిలీ అయినప్పటికీ ఈ ప్రాంతంతో ఉన్న ఆప్యాతను మర్చిపోలేమని కంటా నీరు పెట్టుకున్నారు.
Post A Comment: