మన్యం మనుగడ,పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పినపాక మండలం, పినపాక గ్రామానికి చెందిన మేడి శివయ్య(75) గత కొంతకాలం క్రితం చెరువులో పడి మృతి చెందిన విషయం విదితమే. మృతుడి కుటుంబానికి గురువారం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గం తెరాస యువజన విభాగపు కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి 2 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ పినపాక గ్రామకమిటీ అధ్యక్షుడు ఎల్లు సత్తిరెడ్డి , తెరాస ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సోంపెల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: