CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం.

Share it:

 


మన్యం మనగడ వాజేడు జనవరి 28.



 వెంకటాపురం మండలం లో సొసైటీ ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ పార్టీ వాజేడు, వెంకటాపురం మండలముఖ్య కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య ,భద్రాచలం నియోజకవర్గ సభ్యత నమోదు కార్యక్రమం ఇన్చార్జ్ జలీల్ , హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోదేం వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని కార్యకర్త లకోసం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల భీమా అందిస్తుందని,ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ,దీనికి పునాది. ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేస్తూ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కి కచ్చితంగా బుద్ధి చెబుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు దుర్గాప్రసాద్, ఎంపీపీ చెరుకూరిసతీష్ కుమార్, పి ఏ సి ఎస్. ప్రెసిడెంట్ మోహన్ రావ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు పల్నాటి, కిసాన్ మండల అధ్యక్షులు జల్లిగంపల చంద్రకళాధర రావు, కిసాన్ జిల్లా కార్యదర్శి ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన్యం సునీల్, చిడెం శివ, వైస్ ఎంపీపీ సయ్యద్ హుసెన్, ఎంపీటీసీ రవి,సీతాదేవి,జయమ్మ, వాజేడు నాయకులు విక్రంత్, సర్పంచ్ ఆదినారాయణ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: