CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వితంతువులకు బియ్యం,చీరలు,దుప్పట్లు పంపిణీ.

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం:

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వితంతువులను జి టీ ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ గుర్తించి కొత్తగూడెం, గొల్లగూడెం గ్రామాలకు సంబంధించిన సుమారు వంద మంది వితంతువులకు శుక్రవారం బియ్యం, చీరలు, దుప్పట్లు, స్నాక్స్ మొదలగు వస్తువులను సర్పంచుల చేతుల మీదగా ఆ సంస్థ ఇన్చార్జి ఆర్వి రామారావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గొల్లగూడెం,కొత్తగూడెం సర్పంచులు ఇర్ప విజయ్ కూమార్,గొగ్గల నాగమణి-నారయణ మాట్లాడుతూ...జిల్లా సరిహద్దు గ్రామాలైన కొత్తగూడెం,గొల్లగూడెం గ్రామంలో కరోనా వలన ఇబ్బందులకు సతమతమవుతున్న వితంతువులను గుర్తించి,

జి టీ ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ కానుకగా బియ్యం, చీరలు, దుప్పట్లు, స్నాక్స్ మొదలగు వస్తువులను అందించడం అభినీయం అని,మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ ప్రాంత ప్రజలను గుర్తించినందుకు 

జి టీ ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్వి రామారావు ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు ఈసం సమ్మయ్య,స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సున్నం సరోజిని,జి టీ ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సురేష్,సందీప్,వెంకటేష్,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: