కొత్తగూడెం: భగవత్ శ్రీ రామానుజాచారి సహస్రాబ్ది ఉత్సవాల కోసం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 12 రోజుల పాటు శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామి ఆద్వర్యం లో కొనసాగే మహత్తర కార్యక్రమానికి భద్రాచలం నుండి 40 మంది ఋత్వికులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళుతుండగా కొత్తగూడెం లోని శ్రీ వేంకటాద్రి ఆలయ కమిటీ సభ్యులు కలుసుకున్నారు. ఋత్విక వాహనాలకు ఆలయ కమిటీ స్వాగతం పలికింది. 12 రోజులు జరిగే మహత్తర కార్యక్రమానికి ఆలయ కమిటీ ఛైర్మన్ యెల్డండి పూర్ణచందర్ రావు చేయుతనందించారు. బియ్యం , కూరగాయలు, కంది పపు, మంచి నూనె, ఇతర కిరాణా వస్తువులను. ఋత్వికుల వాహనంలో తొలి విడత సరకులు అందించారు. మరో దఫా ఇచేందుకు హామీ ఇచ్చారు. మహాత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకుజన్మధన్యమని , ఋత్వికులకు ఆశీర్వాదం మహాభాగ్యమని పూర్ణచందర్ రావు పేర్కొన్నారు. సమాజాహితం కోసం తమ వంతు కార్యక్రమాలు చేపడుతున్న కొత్తగూడెం శ్రీ వేంకటాద్రి దేవాలయ కమిటీ ని ఋత్విక బృందం అభినందించింది.
Post A Comment: