మన్యం టివి దుమ్మగూడెం:
భద్రాచల మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర నరసింహారావు అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు పొదెం వీరయ్య మరియు పొదెం మధు చంద్ర పాల్గొని, కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్యే వీరయ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి 2022 సంవత్సరం ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని దేవుని ప్రార్థించారు, అంతేకాకుండా భద్రాచలం లో ఉన్న భగవాన్ దాస్ కాలనీలోని చర్చికి వెళ్లి నూతన సంవత్సర ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరియాల రవికుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, మాజీ భద్రాచల పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి శేఖర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ తరుణ్ మిత్ర, జిల్లా మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యాకూబ్ పాషా, బూర్గంపాడు మండల ఇంచార్జ్ కృష్ణారెడ్డి, భద్రాచలం పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఆరిఫ్ పాషా, మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: