గుండాల జనవరి 5 (మన్యం మనుగడ) రైతుబంధు వచ్చి సంక్రాంతి పండుగను ముందే తీసుకు వచ్చిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య అన్నారు. బుధవారం మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో గల రైతు వేదికలో రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాలనుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుబంధు సంబరాలను నిర్వహిస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, రాము, లింగ గూడెం సర్పంచ్ జనగం నరసింహారావు, రొళ్ల గడ్డ సర్పంచ్ అజ్మీర మోహన్, షేక్ అబ్దుల్ నబి, గడ్డం రమేష్ , జాడి ప్రభాకర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, పూనెం సత్యం, పూనెం చంద్రయ్య , పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: