మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల రాజుపేట గ్రామంలో బుధవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు మండల ప్రధాన కార్యదర్శి చిట్యాల రాజశేఖర్, జిల్లా నాయకులు మలిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్బంగా మొక్కలు నాటారు.తదనంతరం యువనాయకులు మాట్లాడుతూ మలిరెడ్డి సుధాకర్ రెడ్డి, చిట్యాల రాజ శేఖర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువత కు స్ఫూర్తిని ప్రసాధించిన మహానుభావులు అటువంటి వ్యక్తి జయంతి నాడు మాత్రమే ఆయనను స్మరించు కోవటమే కాదు ఎల్లప్పుడూ ఆయన ను ఆయన ప్రబోధించిన ప్రవచనాలు ఒక్కొక్కరు స్మరించుకోవాలి... స్వామి వివేకానంద మాటల్లో యువతా మేలుకోండి మీ శక్తి ఏమిటో గ్రహించండి దేనికి భయపడవద్దు మీరు అద్భుతమైన పనులు చేయబోతున్నారు భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికి రారు ఈ ప్రపంచంలో ఘోరమైన భాధలన్నింటికి అసలు కారణం భయమే... భయమే మన దుఖలాన్నింటికి మూల కారణం నిర్భయత్వం క్షణంలో మనకు స్వర్గాన్ని కొని తేగలదు...కాబట్టి లేవండి మేలుకోండి గమ్యాన్ని చేరే వరకు మీ ప్రయాణానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకండి.. లాంటి విలువైన మాటలతో ప్రజలను చైతన్య పరిచిన మహానుభావులు స్వామి వివేకానంద ఆయనను ఎల్లప్పుడూ తలచుకుంటే యువత ధైర్యాన్ని స్ఫూర్తిని పొందుతారు అని ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్రీ ప్రేమకుమర్, కిలారి చైతన్య, లంక రాకేష్, ఎస్ సాయి, చిట్యాల బాలు,వీర్ల రమేష్, దేపాక వంశీ, ఏ రాజశేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: