CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటినా ఆదివాసీ విద్యార్థులను సన్మానించిన మండల నాయకులు.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు గోవా రాష్ట్రంలో గత నెల 29 నుంచి ఈ నెల 2 వ తేదీ వరకు నిర్వహించగా మండలంలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి పండువారిగూడెం గ్రామానికి చెందిన కొర్రి జగదీష్, మడకం లక్ష్మణ్ స్వామి, కొండతోగు గ్రామానికి చెందిన తుర్సం నాగదుర్గారావు జాతీయ జట్ల తరఫున పాల్గొన్నారు. లక్ష్మణ్స్వామి, కొర్రి జగదీష్ వాలీబాల్ పోటీల్లో, తుర్సం దుర్గారావు అండర్ -17 విభాగం నుంచి 100 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన విషియం తెలిసిందే ఈ సందర్బంగా మండల నాయకులు రైతు సమన్వయ సమితి మండల అద్యక్షులు జూపల్లి రమేష్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షలు నారం రాజశేఖరులు వారిని అశ్వారావుపేట లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జూపల్లి రమేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రతిభను కనబరిచిన ఈ గిరిజన విద్యార్థులు ఉన్నత మైన స్థానానికి వెళ్ళాలని, అందుకు అనుగుణంగా తెరాస పార్టీ నుండి అన్ని రకాల సహాయర్దాలు అందేలా కృషి ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చి వారికీ అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వారితో పాటు నందిపాడు గ్రామపంచాయితీ సర్పంచ్ ఊకె వీరాస్వామి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: