- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
- పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం
పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఎక్స్ రోడ్డు పార్టీ కార్యాలయంలో అద్యక్షులు గొడిశాల రామనాధం అద్యక్షతన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచలో గ్రామంలో ఆత్మహత్యలు జరిగిన దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామమని తెలిపారు. పాత పాల్వంచ గ్రామంలో రామకృష్ణ కుటుంబంలో వనమా రాఘువ అనే వ్యక్తి రామకృష్ణ కుటుంబంపై చేసిన ఒత్తిడి కారణంగా సంఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపరిచింది.రాఘవ చేసినటువంటి ఒత్తిడి గురై కుటుంబం మొత్తం ఇంటిలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది.వనమా రాఘవ వంటి మానవ మృగాన్ని శిక్షించాలని రాఘవ చేష్టలకు రామకృష్ణ కుటుంబం బలైపోయి 3 రోజులైన ప్రభుత్వంగాని , పోలీస్ లు గాని లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉపయోగించడం లేదని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొత్తగూడెం శాసన సభ్యులు,కుమారుడు వనమా రాఘవేంద్రరావు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా మీడియా మొత్తం రాష్ట్రం అంతా తెలిసే విధంగా కోడైకూసినట్లుగా ఉంటే కేసిఆర్ కు వినబడుట లేదా, కనబడుటలేదా జరిగి 3 రోజులు అయిన ప్రభుత్వం వెంటనే స్పందించి వనమా రాఘవను అరెస్ట్ చేసి,కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మనకి పునరావృతం కాకుండా గతంలో 2005 వరంగల్లో జరిగిన సంఘటన ప్రకారం పోలీస్ యంత్రాంగం ఈ రాఘవను ఎక్కడ వున్న అరెస్టు చేసి వెంటనే పాలవంచ ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో పొనుగోటి చందర్రావు, బత్తుల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: