చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పోకలగూడెం గ్రామంలో గల ఊరచెరువుకు సరిహద్దులను గుర్తించాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం తహసిల్దార్ ఉషశారదకు రైతులు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఊరచెరువు ప్రక్కనే గల కొందరు ఆక్రమణకు పాల్పడుతున్నారని, భవిష్యత్తులో చెరువు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. నీటి పారుదల శాఖ అధికారులు అన్ని తెలిసి కూడా పట్టించుకోవడం లేదన్నారు.రైతుల భవిష్యత్తును గుర్తించి ఆక్రమణలు తొలగించి హద్దులు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగేశ్వరరావు,గుగులోత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: