గుండాల/ ఆళ్ల పల్లి జనవరి 11( మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం గిరి వికాస్ పథకం ద్వారా మండలం పరిధిలోని రాయి గూడెం, అనం తోగు, చంద్రాపురం, సుద్ధ రేవు, నడిమి గూడెం గ్రామాల్లో ఐటీడీఏ ద్వారా బోర్లు త్రి ఫేస్ కరెంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరైన రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. వాటిని నేడు కొబ్బరికాయ కొట్టి బోర్ మిషన్ లు ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీడీవో మంగమ్మ , డైరెక్టర్ సాంబశివరావు, పార్టీ నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: