గుండాల /ఆళ్ల పల్లి జనవరి 4 (మన్యం మనుగడ) గ్రామ గ్రామాన రైతుబంధు సంబరాలను నిర్వహిస్తామని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: