మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడిన రేగా కాంతారావుకు అశ్వారావుపేట నియోజకవర్గ యువజన నాయకులు మోటూరు మోహన్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ విప్ గా, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల మనసు గెలిచాడని, నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి చూపును ప్రసాదించి, నియోజకవర్గ కంటి వెలుగు అయ్యాడని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం అవుతున్నాడని, పని తీరును గమనించిన తెలంగాణ ప్రభుత్వం జిల్లా బాస్ గా నియమించడం హర్షించదగిన విషయం అని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవులు చిన్ని, కోట మహేష్ రావు, మోటూరి చిలకా రావు, శివ, దయ, వెంకటేశ్వరావు, శేఖర్, పండు. అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: