గుండాల జనవరి 28 (మన్యం మనుగడ) పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులను ట్రెంచ్ ఇయ్యమని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునరి మధు అన్నారు. శుక్రవారం ముత్త పురం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కోసం తీసుకు వెళుతున్న జెసిబి వాహనాలను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గిరిజనులు ఇతర నిరుపేద ప్రజలు సాగుచేసుకుంటున్న భూములను లాక్కొని హరితహారం మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసమన్నారు. నిరుపేదల సాగు చేసుకునే భూముల జోలికి రావద్దు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు, నాయకులు నరేష్ , పీ వై ఎల్ నాయకులు రవి, భానోత్ లాలు, కొమరం హనుమంతరావు, కొమరం సత్యనారాయణ, ఎట్టి రాంబాబు, తాటి రమేష్ , వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: