మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 28 ) శుక్రవారం నాడు దమ్మపేట మండలం లో విద్యార్థి నాయకుడు మడకం ప్రసాద్ అధ్యక్షుతన జరిగిన సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆదివాసి డోలు వాయిద్యం కళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను తన పాటలతో కాపాడుతున్న డోలు వాయిద్య కళాకారుడు భద్రాద్రి జిల్లా మణుగురు మండలం కునవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆదివాసి సమాజం హర్షిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు అలాగే ఆదివాసి కళాకారులకు అందరికీ ఆర్థిక సహాయం ఫించన్ అందించాలని ఆదివాసీ కళలు అంతరించిపోకుండా కాపాడాలని కోరారు ఈ సమావేశంలో దమ్మపేట మండల సీనియర్ ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం తాటి పోతురాజు పరిష్క మారేష్ వాసం వెంకటేశ్వరరావు గడ్డం వెంకటేష్ ఆళ్ల జంగం సోయం రామ్మూర్తి విద్యార్థి నాయకుడు అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసి యువ నాయకులు వాడే వీరాస్వామి మొదలగు వారు పాల్గొన్నారు
Navigation
Post A Comment: