చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ పంచాయతీలో అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇవ్వాలని జడ్పీటీసీ కొణకొండ్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు సంబరాలు టిఆర్ఎస్ మండల నాయకుల సంబరాల ఉన్నాయని, సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు పేరుతో వారికి వచ్చే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేశారని ఆయన విమర్శించారు. చండ్రుగొండ పంచాయతీలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇక్కడ వారికి ఇవ్వాలని, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి కేటాయించవద్దన్నారు. పేద ఎస్టి, ఎస్సీ, బిసి, మైనార్టీలకు సైతం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు భానోత్ కమలమ్మ, బడుగు శంకర్, తదితరులు ఉన్నారు.
Post A Comment: