మన్యం మనుగడ వాజేడు జనవరి 10. ఈరోజు వాజేడు మండల కేంద్రంలో రైతు బంధు సంబరాలు తెరాస మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాజేడు మండల కేంద్రము లో ట్రాక్టర్ల ద్వారా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రము లో తెరాస నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాజేడు మండల పరిధిలోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వాజేడు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వెంకటాపురం (నూగూరు) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, బోదెబోయిన బుచ్చయ్య, మాట్లాడుతూ రైతులకు తెరాస ప్రభుత్వం రైతుబందు ద్వారా మేలు చేస్తుంది అని ఈ 2021-2022 వానాకాలం పంటలకు గాను మన వాజేడు మండల రైతుల ఖాతాలో 8, 77,04,883, కోట్లు యాసంగీ పంటకు 8,42,66,683 కోట్ల రూపాయలు ఒక వాజేడు మండల రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి తల్లడి పుష్పలత యంపిపి శ్యామల శారద జిల్లా రైతు సమన్మయ సమితి కార్యవర్గ సభ్యులు తల్లడి నానిబాబు ఎంపిటీసి లు బి.పార్వతి యాలం.చిట్టిబాబు సర్పంచులు జజ్జరి మేనక, వాసం మల్లేశ్వరి బి.సరళ తెరాస మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణ రెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు ఎ ఇ ఓ, లు ప్రియాంక హరీష్ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: