మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,జిల్లాఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ములుగు ఏఎస్పి సుధీర్ ఆర్ కే కన్,ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ లను నూతన సంవత్సరం సందర్భంగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క కలిసి వారిని శాలువతో సన్మానించి,వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భముగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధిలో కీలక బాధ్యత కలెక్టర్,నిర్వహి స్తున్నారని,రాబోవు రోజుల్లో ములుగు జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని,దాని కోసం కలెక్టర్ కృష్ణ ఆదిత్య అహర్నిశలు కష్టపడు తున్నారని అన్నారు.అలాగే జిల్లాలో శాంతి,భద్రతలను సమంగా కాపాడుతున్న పోలీస్ వ్యవస్థను కొనియాడారు.నీతి, నిజాయితీ,నిబద్ధతతో చట్టాన్ని అనుసరిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ, ములుగు జిల్లా అధికారుల అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,ములుగు మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా,కన్నాయిగూడెం మండల జడ్పీటీసీ కరంచంద్ గాంధీ, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా,ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,ముదురు కోళ్ల తిరుపతి,వార్డు సభ్యులు నాగ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: