CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజుపేట కేంద్రంగా తక్షణమే ఎస్ బి ఐ బ్యాంకు ఏర్పాటు చేయాలి-:వివిధ ప్రజా సంఘాల డిమాండ్

Share it:

 



మన్యం మనుగడ మంగపేట. మంగపేట మండల కేంద్రంలోని రాజపేట కేంద్రంగా ఎస్బిఐ బ్యాంకును తక్షణమే ఏర్పాటు చేయాలనిప్రజా సంఘాలు డిమాండ్ చేశారయి.ఎస్బిఐ బ్యాంకు ఏర్పాటు చేయాలనీ ఈ సందర్బంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసమై రాజుపేట సమీప గ్రామాల ప్రజలతో సంతకాల సేకరణ చేశారు. మండలంలోని కమలాపురంలో ఎస్బిఐ బ్యాంకు ఉండడంతో మండల ప్రజలు కమలపురం పోయి రావాలంటే అనేక ఇబ్బందులుపడుతూ ఒక రోజు పనిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు వాహనాలలో అధిక ఛార్జీలు పెట్టి మధ్య తరగతి ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని తెలియజేశారు. రాజపేట కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు. రమణక్కపేట కత్తి గూడెం బ్రాహ్మణపల్లి దోమెడ నిమ్మ గూడెం రామచంద్రునిపేట వాడగూడెం. పంచాయతీ పరిధిలోని 20 గ్రామాలకు పైగా ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని తక్షణమే ప్రజల సౌకర్యం రాజుపేటలో ఎస్బిఐ బ్యాంకు తక్షణమే ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.లేనియెడల రాజుపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈసందర్బంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మడే రవి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తోకల రవి 

వివిధ ప్రజా సంఘాల యువత శ్రీను రెడ్డి హుస్సేన్ కేశవ రాజశేఖర్ సాంబశివరావు వెంకటేశ్వరరావు వెంకటాద్రి నరసింహారావు చిరంజీవి ల తో పాటు సమీప గ్రామ ప్రజలు పాల్గొన్నారు తదితరులు మేరాజ్ వీరజ్ నవదీప్ కేశవ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: