మన్యం మనుగడ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ సభ్యులు నలుగురి మృతికి కారకుడైన వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు తో పాటు మరో ఇరువురు నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు పాల్వంచ ఆత్మహత్య ల ఘటనపై గురువారం మణుగూరు లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వనమా రాఘవ పై సెటిల్మెంట్లు భూ దందాలు బెదిరింపులు మహిళల పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలపై ,ప్రభుత్వం పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంవల్లే,
రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య సంఘటన పునరావృతం అయిందని,
నలుగురు కుటుంబ సభ్యులు బలయ్యారని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా నిందితుడు వనమా రాఘవని కాపాడే చర్యలు మానుకొని,తక్షణమే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో నాయకులు
దుబ్బాక జగ్గన్న బండ్ల వెంకటేశ్వర్లు మలికంటి రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: