CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. పాల కోసం ఏడుస్తూ అందరి చేత కన్నీళ్లు పెట్టించిన పసికందు.

Share it:

 



మన్యం టీవి, అశ్వారావుపేట:ఓ రోడ్డు ప్రమాదం ఏడు నెలల పసికందుకు తల్లిని లేకుండా చేసిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపాక గ్రామానికి చెందిన కునసోతు విజయ్- లక్ష్మీ ప్రియ (22) దంపతులు తమ ఏడు నెలల పాపతో ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండల కేంద్రానికి బయలుదేరారు. రాజమండ్రి నుండి భద్రాచలం వైపు వెళ్తున్న రాజమండ్రి చెందిన ఆర్టీసీ బస్సు వినాయకపురం సమీపంలో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా దూసుకురావడంతో రోడ్డు అంచును దించుతుండగా దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో భార్య లక్ష్మీ ప్రియ పై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త విజయ్ కి, పాపకు గాయాలయ్యాయి. విజయ్, లక్ష్మీ ప్రియలకు ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా 8 నెలల క్రితం పాప పుట్టింది. సంక్రాంతి పండుగకు సినిమాకు తీసుకువెళ్లలేదు.. కాబట్టి కాళ్ల పట్టీలు (పట్టాలు) కొనివ్వాలని భర్తను బతిమిలాడుతుంటే.. ఆదివారం కావడంతో భార్య ముచ్చట తీర్చేందుకు అశ్వారావుపేట తీసుకువస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బోరున విలపించాడు. 8 నెలల పసికందు తల్లి పాల కోసం విలపిస్తున్న సన్నివేశం అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

Share it:

TS

Post A Comment: