CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన అమరారం రైతులు.

Share it:

 



మన్యం మనుగడ , పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయతీ రైతులు వారు పొందిన రైతుబంధు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ, రైతుల పక్షాన నిలబడి రైతుబంధు అందజేయడం, తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందని, ఆనందం వ్యక్తం చేశారు. వేసే పంటకు పెట్టుబడిగా రైతుబంధు ను తెలంగాణ ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా, రైతుల పక్షాన నిలబడే రైతు బంధువుగా కేసిఆర్ వుండడం ఆనందకరమని రైతులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమరారం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేష్, వార్డు మెంబర్లు శాంత, ప్రశాంతి, నాగమణి, కాంతారావు ,రైతులు మల్లయ్య, రామ్మూర్తి, పెంటయ్య, నాగేష్, నాగేశ్వరరావు, తరుణ్, రాము, జంపయ్య , సాగర్, అర్జున్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: