మన్యం టీవీ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని హైదరాబాదులోని వెంకటాద్రి టౌన్షిప్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పినపాక నియోజకవర్గ ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ డివిజన్ అధ్యక్షులు పోల బోయిన అనిల్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు.అనంతరం వారు రేగా కాంతారావు కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ బిడ్డలకు తగుప్రాధ్యానం ఇస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: