మన్యం టీవీ కరకగూడెం: మండలపరిదిలోని చిర్రమళ్ళ గ్రామపంచాయతీలో సర్పంచ్ పాయం నరసింహారావు శుక్రవారం యువతకు వాలీబాల్ కుట్లు పంపిణీ చేశారు .అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా నాయకుడికి పదవులు నడుచుకుంటూ వస్తాయని ఉదాహరణ మన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు అని ఆయన అన్నారు. జిల్లా మొత్తాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ఆయనే కె సాధ్యపడుతుందని జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ర్ పోల బోయిన రాజు, ఆదర్శ యూత్ సభ్యులు చందా వంశీ, చందా ఉమామహేశ్వరరావు, ప్రణయ్ ,సాయి ,రాజేంద్ర ప్రసాద్, సిద్దు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: