ములకలపల్లి:జనవరి01:మన్యం మనుగడ:(న్యూస్):
నరసాపురం గ్రామానికి చెందిన మాదిబోయిన నవీన కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా కోటమ్మ అమ్మవారి కి మొక్కలు ఇచ్చారు.ఈ సందర్బంగా గుడి ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నర్సాపురం అమ్మవారి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు మాట్లాడుతూ మానవాళికి ప్రాణవాయువును అందించే ఇలాంటి మొక్కలు నాటడం ప్రకృతిని కాపాడడమే కాకుండా ముందు తరాల వారికి మనం అందించే అద్భుతమైన ప్రకృతి సంపదని,ఇటు వంటి మొక్కలు బహూకరించిన నవీన్ కుమార్ ని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మరీదు నాగేశ్వరరావు,బజ్జురి వెంకటేశ్వరరావు,లగడపాటి భాస్కర్ రావు,నర్సాపురం గ్రామ యువకులు మొక్కలు నాటడం జరిగింది.
Post A Comment: