మన్యం టీవీ, అశ్వాపురం:
ఈరోజు అశ్వాపురం మండల కేంద్రంలో ఎస్ కే టి ఫంక్షన్ హాల్ నందు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మణుగూరు నివాసి సకిని రామచంద్రయ్య ను శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు ఆదివారం నాడు వారిని పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ కళలను సమాజానికి వివరిస్తూ డోలి సంప్రదాయ కళాకారులను గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిన్న నాటి నుంచి తన తండ్రి దగ్గర డోలి నేర్చుకోని వివిధ రాష్ట్రాలకు ఆదివాసీ సంస్కృతి సప్రదయాలను సమాజానికి తెలిసేలా బహిర్గతం చేయడం సకిని రామచంద్రయ్య కృషి మరువలేనిది అని అన్నారు.
Post A Comment: