మన్యం మనుగడ మంగపేట.
ఏ డి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మండలం లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ పాల్గొన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన స్థలం విషయంలో రిజర్వేషన్ పొందిన ప్రతి నాయకులు ఉద్యోగస్తులు విద్యార్థులు రైతులు ప్రజలు మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం అంబేద్కర్ వాదులు కావాలని కోరిన వెంటనే 1997 లో అప్పుడు ఉన్న ఎమ్మార్వో ఈశ్వర్ దాస్ 107/1సర్వే నెంబర్ గల భూమిని అంబేద్కర్ భవనానికి కేటాయించడం జరిగింది.ఇట్టి స్థలాన్ని వేరే వాటికి కేటాయించ కూడదు ఈ స్థలం అందరికీ కావాల్సిన వ్యక్తి రాజ్యాంగ నిర్మాత కోసం కేటాయించింది ఈ స్థలం ఎవరైనా కావాలి అని అడిగినా, వేరేవారికి కేటాయించిన సాక్షాత్తు అంబేద్కర్ ను అవమానించటమే అవుతుంది. అందువలన అంబేద్కర్ భవన నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఏ డి ఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ ఈ సందర్బంగా కోరారు. మన కోసం మన శ్రేయస్సు కోసం మన అభివృద్ధి కొరకు తాను సర్వం దార బోసి భారత రాజ్యాంగాన్ని రాసి తద్వారా ప్రతి ఒక్కరి అభివృద్ధికి బాటలు వేశారు.అటువంటి మహానుభావులు డా :బి ఆర్ అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన స్థలం వేరే వారికి కేటాయించడం సమచితం కాదు.అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందరం కలసి అంబేద్కర్ ఆశయాలను సాదిద్దాం ఆయన అంటూ ఈ సందర్బంగా పరికి శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ డి ఎస్ ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మేడిద సతీష్ ములుగు డివిజన్ ఏ డి ఎస్ ఎస్ నాయకులు చిట్యాల రాజశేఖర్ మంగపేట ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి గాజర్ల రాజు మాదిగ యలమ దాసరి సుధాకర్ మంగపేట మండల ఎమ్మార్వో పిఎస్ ఇన్చార్జ్ గుగ్గిళ్ళ సురేష్ మాదిగ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: