నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా అన్నవరప్పాడు జే.డీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ పొప్పొప్పు నాగేశ్వర రావు తయారు చేయించి పంపించిన క్యాలెండర్ లు భద్రాచలం జేడీ పౌండేషన్ కి చేరుకున్నాయి, వాటిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ ,శ్రీమతి వినీలా దేవి దంపతులు ఆవిష్కరించి ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా శ్రీ ఖంభంపాటి సురేష్ కుమార్ భద్రాచలం పట్టణంలోకి ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు, మరలా అందరూ కలిసి స్వచ్ఛ భద్రాద్రికి, ప్లాస్టిక్ రహిత భద్రాద్రి కి కలిసిరావలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ వేమూరి పవన్ కుమార్,శ్రీ యూసుఫ్ మియా, శ్రీ అంబికా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: