మన్యం మనుగడ మంగపేట.
భారతదేశం లో మొదటి ఉపాధ్యాయరాలు బహుజనులకు పాఠాలను భోధించిన పంతులమ్మ, భారతీయ సంఘ సంస్కర్త, రచయిత్రి, ఆదర్శ మహిళ, ముఖ్యంగా తాడిత, పీడిత ప్రజలకు, అణగారిన వర్గాల కోసం వారి అభివృద్ధి కోసం పరితపించి స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే జయంతి మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
నేతకాని కుల సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు జాడి సాంబశివరావు జాడి నరేంద్రబాబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల సంఘం జిల్లా నాయకులు మరియు మండల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేసిందని కొనియాడారు అందుకే ఆమెను భారతదేశంలో మహిళా మొదటి ఉపాధ్యాయురాలు అని పిలవ పడుతున్నారనిదేశ ప్రజలందరూ కూడా సావిత్రిబాయి పూలే ఆశయాల కోసం కృషి చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దిగొండ కాంతారావు,పూసల నరసింహారావు,దుర్గం నరసింహారావు,మండల నాయకులు బసారీ నాగార్జున,కొండ గొర్ల రాంబాబు,సల్లురు సత్యనారాయణ,దుర్గం సతీష్ పూసల ప్రభాకర్ తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గం బిక్షపతి మరియు నేత కాని కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: