భద్రాచలం శిల్పి నగర్ కాలనీకి చెందిన గజ్జరపు రమణమ్మ అనే నిరుపేద మహిళ, కుమార్తె గజ్జరపు నాగలక్ష్మి అనే డిగ్రీ చదివే పేద బాలికకు చదువు కోసం జేడీ ఫౌండేషన్ ద్వారా ఆమెకు బుక్స్, ఫీజు సహకారం అందించడం జరిగింది ఈ క్రమంలో, ఆమె తల్లి రమణమ్మ ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తుంది.ఈ క్రమంలో తల్లీ అనారోగ్యంతో బాధపడుతున్నందున బాలిక తల్లి కోసం తన తల్లి చేసే ఇళ్లల్లో పనులు చేస్తూ తన తల్లీ ఆరోగ్యాన్ని కాపాడమని పౌండేషన్ దీనంగా వేడుకుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అవడంతో పూర్తిస్థాయి పరిశీలన నిమిత్తం నిమ్స్ కి పంపించడం జరిగింది. ఆరోగ్యశ్రీ, నిమ్స్ లో మిత్రుల సహకారంతో శ్రీమతి రమణమ్మ కు ట్రీట్మెంట్ మరియు ఇతర భోజనం ని ఏర్పాటు చేయడం జరిగిందని. కిడ్నీ సంబంధించి వ్యాధికి సంబంధించిన వారికి కావలసిన బయాప్సి మరియు ఇతర టెస్టులు నిమిత్తము Rs.10 వేల రూపాయలను జేడీ ఫౌండేషన్ సభ్యుల ద్వారా విరాళాలు రూపంలో సేకరించి శ్రీమతి రమణమ్మ భర్త శ్రీనివాస్ కి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ పవన్ కుమార్,శ్రీ కడాలి నాగరాజు చేతులమీదుగా అందజేసినట్లు జెడి ఫౌండేషన్ బాధ్యులు మురళి మోహన్ కుమార్ తెలిపారు. తమ దీన పరిస్థితి ని తెలుసుకొని ఆరోగ్య నిమిత్తం ఆర్థిక సాయం అందజేసిన జేడీ పౌండేషన్ కి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాము అని శ్రీమతి రమణమ్మ కుటుంబం తెలిపింది.
Post A Comment: