మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు గిరిజన సంక్షేమ కళాశాల బాలికల గృహాన్ని, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సింగరేణి అధికారులతో కలిసి,పరిసరాల ను పరిశీలించారు. మరమ్మతులకు గురైన గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.పలు సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.ప్రహరీ నిర్మాణం కోసం త్వరలోనే అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శి నవీన్,రాం రెడ్డి,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,నాయకులు వట్టం.రాంబాబు,నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు,సింగరేణి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: