జలాల్ మొహమ్మద్ మన్యం న్యూస్ ,గుండాల/ఆళ్ళపల్లి:ఆల్లపల్లి కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని రానున్న అంబేద్కర్ జయంతి నాటికి అల్లపల్లి ఈద్గా సెంటర్లో ఏర్పాటు చేయిస్తామని ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి, మాజీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర నాయకులు జలాల్ మహమ్మద్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాన్యులకు సైతం సమానత్వం కావాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్ విగ్రహం మండల కేంద్రంలో లేకపోవడం బాధాకరమని, ఆ మహనీయుడి త్యాగాలు గుర్తు చేసుకుంటూ జయంతి ఉత్సవాలను మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ స్థాయి క్రీడలు క్రికెట్, వాలీబాల్ ముగ్గుల, డాన్స్ పోటీలు మార్చ్ నెలలో ఆల పల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటు జయంతి మహోత్సవాల నిర్వహణ కమిటీని ఆదివారం రోజు ఆళ్ల పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహనీయుడి విగ్రహ ఏర్పాటు, జయంతి మహోత్సవాలకు రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, సినీ ప్రముఖులు, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు మనుషులంతా ఒక్కటే అందరికీ సమానత్వం సమాన హక్కు సమాన గౌరవం దక్కాలని కృషిచేసి బడుగు బలహీన వర్గాలు అందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన అంబేద్కర్ ను స్మరించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ విగ్రహ ఏర్పాటు జయంతి మహోత్సవాలకు రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Navigation
Post A Comment: