CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా బాధిత కుటుంబానికి నిత్యావసరా సరుకులు పంపిణీ.

Share it:


మన్యం మనుగుడ వాజేడు, జనవరి 29: ములుగు జిల్లా .


వాజేడు మండలం గణపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం కరోనా బారిన పడింది. అయినవారు సైతం ఆ కుటుంబం వైపు తిరిగి చూడకపోవడంతో విషయం తెలుసుకున్న సమత ఫౌండేషన్ సభ్యులు శనివారం నాడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుమ్మరి సమ్మయ్య సహాయంతో బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులెవరూ అధైర్య పడవద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే తగ్గుతోందని భరోసానిచ్చారు. బాగా ఇబ్బంది అనిపిస్తే తమను సంప్రదించాలని, నిరుపేద బాధితులకు తమ వంతు సహాయం అందించేందుకు సమత ఫౌండేషన్ సభ్యులం ఎల్లప్పుడు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమత ఫౌండేషన్ ములుగు జిల్లా సభ్యులు కుమ్మరి రాంబాబు జనగామ కేశవరావు పాగే ఆనంద్ పునేమ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: