చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండలంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాలకు జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులను ఆర్థికంగా నిలబెట్టేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, ఎంపీటీసీ దారా వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ గాదె లింగయ్య, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు మంజుశ్రీ, మండల టిఆర్ఎస్ నాయకులు మాలోత్ బోజ్యనాయక్, మద్దిరాల చిన్న పిచ్చయ్య, సారేపల్లి శేఖర్, సూరా వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, కొత్తూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: