CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక ఐనా సకిని.రామచంద్రయ్య సన్మానించిన మణుగూరు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన సకిని.రామచంద్రయ్య ఆదివాసీ ముద్దు బిడ్డ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ శ్రీ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు,కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితా లో ఓకల్,ఫోక్ కళాకారుడు గా రామ చంద్రయ్య ఎంపిక కావడం చాలా సంతోషమని, మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం మన మండలానికి,జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవమని అన్నారు.ఈ సందర్భంగా సకిని. రామచంద్రయ్య ను మణుగూరు మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.సకిని.రామచంద్రయ్య మాట్లాడుతూ ఇంత గొప్ప పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,ఎంపీడీఓ వీరబాబు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు, ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,ఎంపీటీసీ బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక. ప్రసాద్,సర్పంచ్ రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మేకల.రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: