కరోనా 2nd వేవ్ నుండి ఆపత్కాలంలో పలువురి కి ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలుపుతున్న జే.డీ ఫౌండేషన్ ఆక్సిజన్ బ్యాంక్, మరొకసారి తమ ఔదార్యం చాటుకున్నారు. ఇప్పటికే భద్రాచలం, చుట్టుపక్కల గ్రామాలకు ఆక్సిజన్ సిలిండర్లు, మరియు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు అందజేస్తున్న పౌండేషన్ తాజాగా భద్రాచలం రాజీవ్ నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి తాల్ల రత్న కుమారి 45 సంవత్సరాల వయస్సు గల మహిళ శ్వాస ఇబ్బందులు ఎదురవడం తో అత్యవసర పరిస్థితిలో వారి కుటుంబసభ్యులు నిన్న రాత్రి 11 గంటల కు కు జే.డీ ఫౌండేషన్ ని సంప్రదించగా తక్షణమే ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడాలి నాగరాజు ద్వారా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను వారి కుమారుడు శ్రీ రాకేష్ కి అందించడం జరిగింది. అడిగిన వెంటనే లేదనకుండా తక్షణమే స్పందించి తమకు సాయం చేసి ఆదుకున్నందుకు శ్రీమతి రత్న కుమారి కుటుంబం జే.డీ పౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీమోహన్ కుమార్ కి,ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: