గుండాల/ ఆళ్ల పల్లి జనవరి 5 (మన్యం మనుగడ) గ్రామ గ్రామాన రైతుబంధు సంబరాలను నిర్వహిస్తామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. బుధవారం మండలపరిధిలోని మర్కొడ్ గ్రామంలో గల రైతు వేదికలో రైతుబంధు సంబరాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ను అమలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైతుల కోసం మరిన్ని పథకాలను తీసుకురానుంది వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు, మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు, రాఘవాపురం సర్పంచ్ ప్రేమ కళ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, ఏ ఈ ఓ రమణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: