CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డా.ఎండ్లూరి మృతి తీరని లోటు.

Share it:

 


ములకలపల్లి:జనవరి28(మన్యం మనుగడ)న్యూస్:

ప్రముఖ కవి, రచయిత, వక్త, సాహితీ విమర్శకులు  ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ మరణం సాహితీ ప్రపంచానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్ అన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని, కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా పనిచేశారని, ప్రసిద్ధమైన హిందీ, ఉర్దూకవితలు, పద్యాలను తెలుగులోకి అనువదించారన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని, డా. ఎండ్లూరి అకాల మృతి సాహితీ లోకానికే కాకుండా, బహుజన ఉద్యమాలకూ తీరని లోటని ఉస్మాన్ ఖాన్ అన్మారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Share it:

TS

Post A Comment: