అశ్వాపురం మండలంలోని కురపెళ్లి కొత్తూరులో మొండికుంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆంధ్రబ్యాంక్) ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ప్రతాప్ మాట్లాడుతూ బ్యాంకులో కల్పిస్తున్న ఇన్సూరెన్స్ లపై (ప్రధానమంత్రి జీవనజ్యోతి, బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష, అటల్ పెన్షన్ యోజన,) మరియు బ్యాంకు సబ్సిడీలపై అందిస్తున్న రుణ సౌకర్యాలను అందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ భగత్ సింగ్ బిజినెస్ కరస్పాండెంట్ నిధనపల్లి ప్రసాద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: