మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం ఎంపిటిసి ఎలిపెద్ది శైలజ -శ్రీనివాస రెడ్డి ల వ్యవసాయ క్షేత్రం మండల పరిధిలోని మోతే గ్రామం లో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వ్యవసాయ శాఖ విస్తీర్ణం అధికారి తాతారావు తో కలిసి పామాయిల్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగు వల్ల ఒక యాక్టర్ కు నాలుగు నుండి ఐదు టన్నుల మధ్య దిగుబడి వస్తుందని ఆయిల్ ఫామ్ పంట నుండి అత్యధికంగా నూనె దిగుబడి వస్తుందన్నారు. పామాయిల్ పంట దాదాపు అన్ని నెలలో పండుతుందని పంట వేసిన తరువాత మూడు సంవత్సరాల లోపు ఒక వరి పంట మినహా అన్ని రకాల అంతర పంటలు వేసుకోవచ్చని అన్నారు ఒక ఎకరాకు 12 నుండి 15 టన్నుల వరకు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో కరకగూడెం మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే సొందుపాషా,వెంకట్ రెడ్డి పూజారి కృష్ణ, గుమ్మడవెల్లి ప్రసాద్ ,వేణు ,వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: