మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా సీనియర్ తెరాస నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ ములుగు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... కోటి ఆశలతో కొత్త సంవత్సరం లోకి అడుగుగిడుతున్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తుల తూగాలని కోరుతూ ఈ సంవత్సరం లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాక్షించారు. తెలంగాణ రాష్ట్రము లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. యువతను ఉద్దేశించి త్వరలో రాబోయే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇప్పటినుండి సన్నద్ధం కావాలని ముఖ్యంగా గ్రామీణ యువత అన్ని రంగాలలో రాణించాలని సూచనలు చేశారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు మహోన్నత లక్ష్యం తో తెలంగాణ ను అభివృద్ధి పథం లో నడిపిస్తున్నారని తెలంగాణ లో ఎండి పోతున్న ఎవుసానికి నీటిని ఒడిసిపట్టి అనకట్టలు కట్టి నీటిని నిలువ చేసి ప్రతి ఎకరానికి నీరు అందించిన అపర భగీరధుడు అని ప్రశంశలు కురిపించారు. ఈ సమారోత్సాహం తో వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేయాలని కార్యకర్తలకు సూచించారు.
Post A Comment: