CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి -:ఏ ఐ కె ఎమ్ ఎస్ నాయకులు మంగన్న.

Share it:

 


 గుండాల జనవరి 13 (మన్యం మనుగడ) అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏ ఐ కే ఎం ఎస్ నాయకులు ఈసం మంగన్న ప్రభుత్వాన్ని కోరారు. మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయన్నారు. ఎంత మేర నష్టం వాటిల్లింది సర్వే నిర్వహించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసలే రైతాంగానికి అకాల వర్షం చీడపీడల తో నష్టం వాటిల్లుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అమాంతం పెంచి రైతాంగాన్ని నష్టాల ఊబిలో దింపు తుందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి పరిషికా రవి, ఏ ఐ కె ఎమ్ ఎస్ మండల నాయకులు ఎస్కే అజ్గర్, దుగ్గి రియాజ్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: