CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ, ప్రవేట్, మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారి డాక్టర్ వీరబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయము నందు చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మండల వ్యవసాయ శాఖ కార్యాలయము నందు ఏవో రఘు దీపిక జండాను ఎగరవేశారు. అలాగే మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము నందు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుచౌడం నరసింహారావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు, అమరులైన త్యాగధనుల త్యాగాలను గుర్తు చేశారు. మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, రైతు బందు సమితి మండల కో ఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, బేతాళపాడు ఎంపిటిసి వాడ లక్ష్మీ నర్సు, జిల్లా రైతు బంధు సభ్యులు వేల్పుల నరసింహారావు, సీనియర్ నాయకులు శ్రీనాధ రంగరాజు, రామిశెట్టి నాగేశ్వరావు, నర్వ నేని పుల్లారావు, ఎల్లంకి పుల్లయ్య, యల్లంకి చిన్న నాగేశ్వరావు, మోదుగు రామకృష్ణ, వేమూరి కనకయ్య, చౌడం శివ, టిఆర్ఎస్ పార్టీ మండల ఎస్ టి సెల్ అధ్యక్షులు బానోత్ ధర్మ, ఎస్సి సెల్ అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ లకావత్ హేమ్లా, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ రాంబాబు, క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ బోడ బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: