మన్యం టీవీ న్యూస్ ,దమ్మపేట : జనవరి ( 24 ) సోమవారం ;- సమస్యల సాధనకై సీపీఐ
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎన్ యు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేసి దమ్మపేట తహసీల్దార్ రంగా ప్రసాద్ కి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొర్స వెంకటేష్ ,కార్యదర్శి బెల్లం కృష్ణవేణి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యవసాయ కార్మికులకు రక్షణ కొరకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం చేయాలని ,ప్రస్తుతం అమల్లో ఉన్న సీలింగ్ చట్టాన్ని రద్దు చేసి పది ఎకరాల నుండి 15 వరకు భూపరిమితి నూతన చట్టం చేసి మిగిలిన భూమిని సమీకరించు కొని భూమి లేని వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలని,ఆదివాసీల పై వేధింపులు నిలుపుదల చేసి పోడు సాగుదారులు అందరికీ అటవీ హక్కుల చట్టం ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పెన్షన్ రూ.5వేలు చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు కూలీ దళిత బందు 10 లక్షలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ,స్థలం ఉన్న వారికి 6 లక్షలు ఇవ్వాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు కల్పించాలని 600 వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పండూరు వీరబాబు సిపిఐ మండల కార్యదర్శి తంగెళ్ళమూడి శివకృష్ణ ఎస్కే దస్తగిరి గడ్డం ప్రసాదు నాగేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: