మన్యం మనుగడ, మణుగూరు:
గత నాలుగు సంవత్సరాలుగా అశ్వాపురం మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై జూలూరుపాడు మండలానికి వెళ్లిన ఆర్ ఐ తిరుపతి రావు ని మంగళవారం అశ్వాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సిద్దెల తిరుమల రావు-పాత్రికేయు లు కొడారి వెంకటేశ్వర్లు కలిసి తొలుత శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతి రావు ఆర్ ఐ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలంలో భూములకు-సర్టిఫికెట్స్ లకు సంబంధించిన వ్యవహారాల్లో తనదైన శైలిలో ప్రజలకు దగ్గరై మండల ప్రజల మనన్నలు పొందరన్నారు..కరోనా కష్టకాలంలో వారి చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.అలాగే వారు ఎక్కడ ఉద్యోగం చేసినా ప్రజలకు దగ్గరై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరారు.
Post A Comment: