గుండాల జనవరి 11 (మన్యం మనుగడ) ప్రతి ఒక్క రైతు తాము పండించే పంట వివరాలను నమోదు చేసుకోవాలని మణుగూరు వ్యవసాయ సంచాలకులు బి తాతరావు సూచించారు. మంగళవారం ఆయన మండలం పరిధిలోని గుండాల, జగ్గయ్య గూడెం, పోతి రెడ్డి గూడెం, జామరగూడెం, వేపల గడ్డ గ్రామాల్లో గల రైతుల చేనులవద్దకు వెళ్లి రైతులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు తాము పండించే పంటను నమోదు చేసుకుంటేనే కొనుగోలు సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లెనిన్, రైతులు పాల్గొన్నారు
Post A Comment: