CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేజీబీవీ పాఠశాల కు కేటాయించిన స్థలం మొత్తాన్ని కేజీబీవీ కే స్వాధీన పరచాలి.

Share it:

 



మన్యం టీవీ కరకగూడెం: కేజీబీవీ పాఠశాల కు కేటాయించిన స్థలం మొత్తాన్ని కేజీబీవీ కే స్వాధీన పరచాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.కరకగూడెం మండల కేంద్రంలోని బట్టు పల్లి లో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల కు కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేటాయించిన స్థలం మొత్తం ఆక్రమణకు గురవుతుందని అధికార యంత్రాంగం పట్టించుకోవడం విఫలమవుతోందని వారన్నారు. ఇప్పటికే మండలంలోని ప్రభుత్వ భూములు మొత్తం ఆక్రమణలకు గురి అవుతుంటే రెవిన్యూ శాఖ గాని ఇతర ప్రభుత్వ యంత్రాంగం గాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది తప్ప చర్యలు మాత్రం శూన్యం అన్నారు. కేటాయించిన స్థలం మొత్తం స్వాధీనపరచుకోకుంటే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలో లో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమిస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నారని దీనిపై రానున్న రోజుల్లో పోరాటం కొనసాగిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ సున్నం గంగ మండల కార్యదర్శి సర్ప సత్యం జ్యోతిక నరసింహారావు రాము కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: